ఆ పాము విలువ పాతిక లక్షలు



విశ్వాసాలు, మూఢవిశ్వాసాలు ఉన్న వారు తమకు కలిసొస్తుందంటే ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. కలిసొస్తుందంటే.. కంపరం పుట్టించే పనులకైనా తాము సిద్ధమే అంటారు. దీనికి సంబంధించిన కథాకమామీషు ఏంటంటే.. రెండు తలల పాముల కోసం ఇండోర్‌కు యాభైఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిిప్లియాఖుర్ద్‌ గ్రామానికి చాలామంది వెళ్తుం టారు. అక్కడి పాములుపట్టేవాళ్లను కలుసుకుని తమకు కావాల్సి న రెండు తలల పాములు లేదా ఇతర జాతుల వివరాలను వారికి చెబుతారు. నర్మదా నది తీర ప్రాంతాలలో ఇటువంటి పాములు కోసం వారు వెతుకుంటారు. కేవలం మధ్యప్రదేశ్‌ నుంచే కాకుం డా మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి ఈ తరహా పాముల కోసం వస్తుంటారు. పాములు పట్టేవాళ్ల దగ్గర వీరు కోరుకున్న జాతుల పాములు ఉంటే ఏదో ఒక ఖరీదుకు కొనుగోలు చేస్తారు. పాముల బరువు ఆధారంగా ధర నిర్ణయిస్తుంటారు. 

వాటి ఖరీదు సుమారు రూ.5 లక్షల నుంచి ప్రారంభమవు తుంది. ‘3.5 కిలోల బరువున్న పాము ఖరీదు రూ.25 లక్షల వరకు ఉంది. పాముల కోసం వచ్చే వారిలో అధికశాతం తాంత్రికులే ఉంటారు. రెండు త లల పాములను పాతిపెడితే భూగర్భంలో నిధులను కనుగొనవ చ్చని వారి విశ్వాసం’. అరుదైన జాతుల పాములు అంతరించి పో తూన్నాయని అటు జీవకారుణ్య సంస్థలు ఆందోళన చెందుతున్నా యి. అయితే మూఢ విశ్వాసాల పిచ్చిలో పడి కంట పడుతున్న అరుదైన జాతుల పాములను చంపేస్తుండటం బాధాకరము.

ఆసియా క్రీడల్లో మెరిసిన భారత్‌



16వ ఆసియా క్రీడల్లో భారత్‌ మెరిసింది. ఇప్పటి వరకు దేశం పాల్గొన్న ఏషియాడ్‌లలో అత్యధిక పతకాలను ఈ క్రీడల్లో సాధించి అత్యుత్తమ ప్రదర్శనను భారత్‌ నమోదు చేసింది. మొత్తం 64 (స్వర్ణం 14, రజతం 17, కాంస్యం 33) పతకాలు సాధించి 28 ఏళ్ల క్రితం స్వదేశంలో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో సాధించిన 57 (స్వర్ణం 13, రజతం 19, కాంస్యం 25) పతకాల రికార్డును అధిగమించింది. అంతేకాకుండా, పతకాల పట్టికలో ఆరవ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. దీనితో దాదాపు 25 ఏళ్ల క్రితం 1986 సియోల్‌ ఏషియాడ్‌ తరువాత భారత్‌కు అత్యుత్తమ స్థానం లభించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

సియోల్‌ ఆసియా క్రీడల్లో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 23 కాంస్యాలతో మొత్తం 37 పతకాల్ని సాధించి ఐదవ స్థానాన్ని భారత్‌ సాధించింది. నాలుగేళ్ల క్రితం దోహాలో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు 10వ స్థానం లభించింది. ఈ నెల 12న ఘనంగా ప్రారంభమైన ఈ క్రీడల చివరి వారం రోజుల్లో అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, టెన్నిస్‌, రోయింగ్‌ క్రీడాంశాల్లో అథ్లెట్లు రాణించడంతో భారత్‌ అత్యధిక పతకాల్ని సాధించడమే కాకుండా, పూర్తి సంతృప్తితో ఈ క్రీడల్లో పోరాటాన్ని ముగించింది. మొత్తం మీద భారత్‌ ఆయా క్రీడాంశాల విషయానికి వస్తే, అథ్లెటిక్స్‌లో 5, బాక్సింగ్‌, టెన్నిస్‌ల్లో చెరో రెండు, కబడ్డీలో మరో రెండు స్వర్ణ పతకాలు భారత్‌కు లభించాయి. ఈ క్రీడల్లో బిలియర్డ్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ పంకజ్‌ అద్వాని దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టగా, వరల్డ్‌ నంబర్‌1 బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ 14వ స్వర్ణాన్ని భారత్‌ ఖాతాలో వేశాడు.

అద్వాని నుంచి విజేందర్‌ దాకా...
ఈ క్రీడల్లోని కొన్ని క్రీడాంశాల్లో భారత ఆటగాళ్లు చరిత్ర సృష్టించారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పంకజ్‌ అద్వాని అందరు అనుకున్నట్లుగానే స్వర్ణాన్ని నెగ్గి తన హోదాను కాపాడుకోవడంతో పాటు దేశానికి తొలి స్వర్ణాన్ని అందించగా, షాట్‌గన్‌ షూటర్‌ సోధి పురుషుల డబుల్‌ ట్రాప్‌ ఈవెం ట్లో రెండో స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. అనంతరం రో యింగ్‌ బరిలోకి దిగిన థక్క ర్‌ దేశానికి మూడో స్వర్ణాన్ని సాధించాడు. సొంత బోట్లు లేక అద్దెకు తెచ్చుకున్న బోట్లతో మరో భారత ఆటగాడు బజరంగ్‌లాల్‌ థక్కర్‌ రోయింగ్‌లో తొలి పసిడి పతకాన్ని సాధించి చరిత్ర పుటలకెక్కాడు. 

టెన్నిస్‌లో టాప్‌సీడ్‌ సోమ్‌దేవ్‌ అద్భుతమైన ఆట తీరుతో పురుషుల సింగిల్స్‌తో పాటు, డబుల్స్‌ విభాగంలో లో భారత్‌కు రెండు స్వర్ణాల్ని అందించాడు. స్టార్‌ బాక్సర్‌ విజేం దర్‌ సింగ్‌ (75 కేజీలు) భారత్‌కు ఈ క్రీడల్లో చివరి స్వర్ణాన్ని అందించాడు. మరో యువ బాక్సర్‌ వికా స్‌ కృష్ణన్‌ (60 కేజీలు) కూడా తన ప్రత్యర్థిని ఓడిం చి పసిడిని కైవసం చేసుకున్నాడు. భారత పురుషుల కబడ్డీ జట్టు వరుసగా ఆరవసారి స్వర్ణాన్ని సాధించి డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాను కాపాడుకోగా, తొలిసారి ఈ క్రీడల బరిలోకి దిగిన మహిళల కబడ్డీ జట్టు స్వర్ణంతో బోణీ చేసింది. పురుషుల ఫైనల్స్‌లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఇరాన్‌ జట్టును భారత్‌ ఓడించగా మహిళల ఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌పై భారత మహిళల జట్టు విజయం సాధించింది. 

అథ్లెటిక్స్‌లో కర్ణాటకకు చెందిన అశ్విని అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ 400 మీటర్ల హర్డిల్స్‌, 4/400 మీటర్ల రిలేలో రెండు స్వర్ణ పతకాలను నెగ్గి రికార్డు సృష్టించింది. అంతకుముందు మహిళా అథ్లెట్లు ప్రీజా శ్రీధరన్‌ (3 వేల మీటర్ల స్టీపుల్‌ చేజ్‌), సుధా సింగ్‌ (10 వేల మీటర్లు) రెండు స్వర్ణాలను సాధించి శుభారంభాన్ని ఇచ్చారు. అనంతరం పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో కేరళకు చెందిన జోసెఫ్‌ అబ్రహాం 28 ఏళ్ల తరువాత దేశానికి ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్లో పసిడి పతకాన్ని సాధించిపెట్టాడు. గతంలో 1982లో స్వదేశంలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌కు చెందిన చార్లెస్‌ బొరోమియా 800 మీటర్ల పరుగు పందెంలో దేశానికి పతకాన్ని సాధించిపెట్టాడు. మహిళా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కూడా సింగిల్స్‌తో పాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దేశానికి కాంస్య పతకాల్ని సాధించిపెట్టింది. ఆర్చరీలో భారత ఆటగాడు తరుణ్‌దీప్‌ రాయ్‌ అద్భుత ప్రతిభ కారణంగా వ్యకిగత విభాగంలో తొలి పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. 

చైనాలో పెరుగుతున్న క్రెడిట్‌ కార్డు నేరాలు



క్రెడిట్‌ కార్డ్‌ రంగంలో పెరుగుతున్న వసూలు కాని రుణాలు వల్ల తలెత్తున్న ఇబ్బందుల పట్ల జాగ్రత్త వహించాలని వాణిజ్య బాంకులను చైనా రిజ ర్వ్‌ బాంకు హెచ్చరించింది. 

చైనాలో క్రెడిట్‌కార్డ్‌ రుణాలు 1.19 బిలియన్ల అమెరికన్‌ డాలర్లకు చేరు కుంది. 

ఈ త్రైమాసికం చివరికి క్రెడిట్‌ కార్డ్‌ రుణం గత 180 రోజులకాలానికి 7.92 బిలియన్‌ యువాన్‌, (అంటే 1.19 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు)గా నమో దైందని పీపుల్స్‌ బాంక్‌ ఆఫ్‌ చైనా ఒక ప్రకట నలో పేర్కొంది. ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని, క్రెడిట్‌ కార్డు సంబంధిత మొండి బాకీలు విషయంలో తలెత్తే ఇబ్బందులను జాగ్రత్తగా గమనించమని వాణిజ్య బాంకులకు పిబిసి సూచించింది.

చైనాలో ఆర్థిక వ్యవస్థను కాపాడడం కోసం బ్యాంకు కార్డులకు సంబంధించిన నేరాలను అరికట్టడం కోసం చైనా పోలీసు శాఖ కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. 

ఈ ఏడాది జనవరి-అక్టోబరు మధ్యకాలంలో బ్యాంకు కార్డుకు సంబంధించిన 19,000 కేసులను పరిష్కరించి చైనా పోలీసు శాఖ 600 మిలి యన్ల యుఆన్‌(అంటే 90 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) నిధులను కైవసం చేసుకుందని పబ్లిక్‌ ెసెక్యూరిటీ మంత్రిత్వ శాఖ తెలియజేస్తోంది. 

దేశవ్యాప్తంగా బ్యాంక్‌ కార్డు సంబంధిత నేరాలపై ఈ ఏడాది జనవరి నెల మొదులుకుని ఈ మంత్రిత్వ శాఖ, పిబిసి సంయుక్తంగా ప్రచారం చేస్తు న్నాయి. అప్పటినుంచి క్రమంగా క్రెడిట్‌ కార్డ్‌ వ్యవహారలు నడుపుతున్న 1,000పైగా ముఠాలను పట్టుకున్నారు. 2010 అర్థసంవత్సరం కాలంలో జారీ చేసిన బ్యాంకు కార్డుల సంఖ్య 2.1 బిలియనుకు చేరుకుందని చైనా బాంకింగ్‌ కార్డు పరిశ్రమ వారి సంస్థ చైనా యూనియన్‌ పే విడు దల చేసిన గణాంకాలు వివరిస్తున్నాయి.